ముంబై: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈరోజు సరికొత్త రికార్డు నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ఉదయం తొలిసారి ఏకంగా 50 వేల మార్క్ను దాటింది. ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ 335 పాయింట్లు లాభపడింది. ఆల్టైమ్ హై 50,126.73 పాయింట్లను చేరింది. అటు నిఫ్టీ సూచీ కూడా తొలిసారిగా 14,700 పాయింట్లకు చేరింది.
గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా గత మార్చి నెలలో 25,638 పాయింట్లకు పడిపోయిన సెన్సెక్స్.. 10 నెలల కాలంలోనే అంతకు రెట్టింపు స్థాయికి చేరడం విశేషం. అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణం చేసిన రోజున అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. దీని ప్రభావం భారత మార్కెట్లపై సానుకూలంగా కనిపించింది. అమెరికా నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారంతో మదుపురులు మార్కెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బైడెన్ త్వరలో పలు ఆర్థిక ప్యాకేజీలు ప్రవేశపెడతారని వారు భావిస్తున్నారు. ఇక మనదేశంలోనూ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం, అలాగే వ్యాక్సినేషన్పై పాటిజివ్ అప్ డేట్ వస్తుండటంతో పెట్టుబడిదారులు ఆశావహ దృక్ఫధంతో ఉన్నారు.